“నవలంటే ఏమిటి?” అనే ప్రశ్నతో మొదలుపెట్టి నవల గురించి, నవలాశిల్పం గురించి, రకరకాల నవలల గురించి ప్రముఖ నవలారచయిత వడ్డెర చండీదాస్ రాసిన వివరణాత్మక వ్యాసం “నవలాశిల్పం – కొన్ని పరిశీలనలు” వ్యాసనేత్రంలో.
నవలాశిల్పం గురించి వడ్డెర చండీదాస్
March 13th, 2009కథ గురించి చలం
February 23rd, 2009విశ్వసాహిత్యంలో కథ గురించి చలం రాసిన ఒక వ్యాసాన్ని నేత్రం సేకరించి పునర్ముద్రించింది. వ్యాసనేత్రంలో చదవగలరు.
పెనుగొండ లక్ష్మీనారాయణ నేపథ్యం
February 23rd, 2009తెలుగులో కథలకైనా, కవితలకైనా ఆయన కలం ఒక గీటురాయి. ఆయన రచన కథల మాష్టారు కా.రా.గారు శ్రీకాకుళంలో ‘కథానిలయం’ నెలకొల్పడానికి ప్రేరణనిచ్చింది. ఆయన గురించి ఎస్వీ సత్యనారాయణ ఇలా అన్నారు:
”అతడొక అభ్యుదయ సాహిత్యోద్యమ కార్యకర్త
అరుదుగా అద్భుతమైన కవితలల్లే కావ్యకర్త
ఆధునిక కథా సరిత్సాగరంలో
ఆణిముత్యాల నేరుకుంటూ వుంటాడు
అందమైన కవితా పంక్తుల్ని మననం చేస్తూ
అందరికీ పంచుతూ వుంటాడు
అతడొక మౌన కృషీవలుడు.”
ఆయన అభ్యుదయ రచయితల సంఘం (అరసం) రాష్ట్ర అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ. ఆయన పడిలేచిన కడలి తరంగం అంటున్నారు కోట పురుషోత్తం నేపథ్యంలో.
శ్రీరంగం నారాయణబాబు రుధిరజ్యోతిలో భావచిత్రాలు
February 19th, 2009“శ్రీరంగం నారాయణబాబుగారి ఒక్కొక్క కవితనూ పరిశీలిస్తూ పోతే అవన్నీ భావచిత్రాల గనులు. క్లుప్తత, సంశ్లిష్టత, గాఢత పెనవేసుకున్న కవితా శిల్పం ఆయనది. అనంతమైన అనుభూతిని, ఆలోచనామృతాన్ని ప్రసాదించేవి. సంవేదనను రగిలించేవి. ‘రుధిరజ్యోతి’ అనే పదబంధం ఆయన కవితల్లో పలుమారు పునరావృతమవుతూ వుంటుంది. ఆయన మనసు పడిన పదబంధం అది. అది విప్లవ తత్వాన్ని సూచించే ఫిరంగిగుండు.” అంటూ శ్రీశ్రీపట్ల సోదరాభిమానంతో
“నీ పాటల కత్తులతోనే
నా హృదయం నెత్తురు తీసి
నే వెలిగించిన ఈ దీపపు కాంతిని
నర్తింపుముర శ్రీ శ్రీశ్రీ!”
అనగలిగిన శ్రీరంగం నారాయణబాబు రుధిరజ్యోతిలోని భావచిత్రాలను మనకు చూపిస్తున్నారు డా. పి.సంజీవమ్మ వ్యాసనేత్రంలో.
తస్లీమాపై దాడికి సంబంధించిన కథనాలు
February 4th, 2009హైదరాబాదులో 2007లో తస్లీమా నస్రీన్ పై జరిగిన దాడికి సంబంధించిన కథనాలు తస్లీమా నస్రీన్పై అనాగరిక దాడి, వెరవను.. రచన ఆపను… తస్లీమా నస్రీన్, తస్లీమా సంఘీభావ ప్రదర్శన.
వార్తానేత్రంలో
February 2nd, 20092007 లో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో జరిగిన గుర్రం జాషువా 36వ వర్ధంతి విశేషాలు, భమిడిపాటి రాధాకృష్ణ, పాత్రికేయుడు, అనువాద రచయిత సహవాసి ల మృతి గురించి వార్తా నేత్రంలో.
వార్తానేత్రం
February 1st, 2009‘వార్తానేత్రం‘లో కవిత్వశిల్పి ‘గుంటూరు శేషేంద్ర’, నూతలపాటి కవితా సత్కారం, ‘మనసు కురిసిన ముత్యాలు’ ఆవిష్కరణ సభ, మరికొన్ని విశేషాలు ప్రచురించాం.
కడలి తీరంలో కవిత ఉప్పెన
December 22nd, 2008అల్లరి చేసే అలల సందడి.. ఎగిసి పడే నీటి తుంపర్లు.. వీస్తున్న చల్లని పవనాలు… కడలి హోరు నడుమ… ”సముద్రమే” ప్రధానాంశంగా నెల్లూరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్రంలోనే ప్రప్రథమంగా వినూత్నంగా గురుపూర్ణిమ వంటి విశిష్టమైన రోజున నిర్వహించిన కవిసమ్మేళనం కడలి తీరంలో కవిత ఉప్పెన గురించి వార్తానేత్రంలో చదవండి.
పల్లె తల్లి ఒడిలో కేతు విశ్వనాథరెడ్డి కథాపురస్కార సభ
December 22nd, 2008ప్రముఖ స్త్రీవాద కథా రచయిత శ్రీమతి వి.ప్రతిమ గారికి కథాసాహిత్యంలో చేసిన విశేష కృషికి గాను 2007లో కేతు విశ్వనాథరెడ్డి కథాపురస్కారం లభించింది. ఆ పురస్కార ప్రదానం జరిగిన సమావేశ వివరాలను వార్తానేత్రంలో చదవండి.
”అస్తిత్వానికి అద్దం పట్టిన స్వప్న శబ్దం”
December 3rd, 2008‘హైకూ’ కవిగా కవితాలోకంలోకి అడుగిడిన ‘రూప్కుమార్ డబ్బీకార్’ ‘సంపెంగ లోలకం’ హైకూల సంపుటితో సాహిత్య పరిమళాల్ని పాఠకులకు పంచారు. ఇప్పుడు ‘స్వప్న శబ్దం’ కవితాసంపుటిలో పల్లె అనుబంధాల్ని ఆరవోశారు. ఆ కవితా సంపుటిపై కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డిగారి సమీక్ష అస్తిత్వానికి అద్దం పట్టిన స్వప్న శబ్దం చదవండి.